ETV Bharat / state

జీహెచ్​ఎంసీ నిధులతో త్వరలో పటాన్​చెరులో శ్మశానవాటిక

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణ శివారులోని 90లక్షల రూపాయల అంచనా వ్యయంతో జీహెచ్​ఎంసీ నిధులతో చిన్నవాగు సమీపంలో నిర్మించిన గ్యాస్​, శ్మశాన వాటికను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి తెలిపారు.

author img

By

Published : Apr 28, 2021, 3:56 PM IST

mla mahipal reddy
mla mahipal reddy

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జీహెచ్​ఎంసీ సర్కిల్ కార్యాలయంలో శ్మశానవాటిక నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి నిర్వహించారు. మనిషి తన జీవితకాలంలో చివరి మజిలీని ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా రుసుము నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే శ్మశానవాటికకు సంబంధించి ట్రయల్​ పనులు సైతం పూర్తయినట్లు తెలిపారు.

కరోనా వైరస్​తో మరణించిన మృతదేహాలకు 7,500 రూపాయలు, సహజ మరణాల మృతదేహాలకు 6వేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శ్మశానవాటికను నిర్మించినట్లు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జీహెచ్​ఎంసీ సర్కిల్ కార్యాలయంలో శ్మశానవాటిక నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే మహిపాల్​ రెడ్డి నిర్వహించారు. మనిషి తన జీవితకాలంలో చివరి మజిలీని ప్రశాంత వాతావరణంలో జరగాలని కోరుకుంటారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా రుసుము నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే శ్మశానవాటికకు సంబంధించి ట్రయల్​ పనులు సైతం పూర్తయినట్లు తెలిపారు.

కరోనా వైరస్​తో మరణించిన మృతదేహాలకు 7,500 రూపాయలు, సహజ మరణాల మృతదేహాలకు 6వేల రూపాయలు రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి , ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శ్మశానవాటికను నిర్మించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : వ్యాక్సిన్ వేసుకోవాలని సీఎం ఎందుకు చెప్పటం లేదు: బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.