ప్రధాని మోదీ పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. జోగిపేట పట్టణంలో వ్యాపారులు ఉదయం నుంచే దుకాణాలు మూసివేశారు. ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించారు.
కరోనా వ్యాప్తి పట్ల ప్రజలకు కల్పించిన అవగాహన ఫలితంగా జనతా కర్ఫ్యూలో వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు వైద్యాధికారి ప్రణీత్. జోగిపేటలోని వంద పడకల ఆసుపత్రిలో కరోనా వైద్యం కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామన్నారాయన. జోగిపేట ఆసుపత్రిలో కరోనా ట్రీట్మెంట్కు కావలసిన కిట్లు సిద్ధంగా ఉంచామన్నారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఈ నెల 31 వరకు మెట్రో రైళ్లు రద్దు