Mother left Her Baby in Rangareddy Dist : చిన్న పిల్లలు పుట్టాలని పూజలు, దానం.. చేసిన వారిని చాలా మందిని చూశాం. చాలా మంది మగ పిల్లవాడు కావాలని ఎంతో ఆశతో ఉంటారు. పిల్లలు పుడుతున్నారంటే ఆ తొమ్మిది నెలలు మహిళ కొన్ని కష్టాలు పడుతుంది. అవన్ని పుట్టిన పసిబిడ్డను చూస్తే ఆ తల్లికి.. తొమ్మిది నెలలు పడిన బాధ అంతా ఒక్క క్షణంలో మరిచిపోతుంది. అలాంటి క్షణాలు కోసం ఎన్నో రోజులు వేచి చూస్తూంటారు. అలాంటిది దీనికి భిన్నంగా ఓ తల్లి నవ మాసాలు తన కడుపులో బిడ్డను మోసి జన్మనిచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ బిడ్డ రోడ్డు పక్కన ఉన్న ఓ వెంచర్ దగ్గర బ్యాగ్లో ఉన్నాడు. పసిబిడ్డ ఏడుపు విన్న గ్రామస్థులు.. పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజక వర్గంలోని విఠ్యాల గ్రామం శివారులో ఎంఆర్ వెంచర్ దగ్గర ఓ బ్యాగులో అప్పుడే పసిబిడ్డని వదిలి గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లిపోయారు. బ్యాగ్లో ఉన్న పిల్లవాడు ఏడువడంతో.. పక్క పొలం పని చేసుకుంటున్న ఓ యువకుడు విని వెంచర్ దగ్గరకి వచ్చాడు. పసిబిడ్డను చూసి షాక్ అయ్యాడు. బాబు కాళ్లపై మిస్బా సన్ అఫ్ అమీర్ ట్యాగ్ వేసి ఉంది. వెంటనే ఆ యువకుడు గ్రామ సర్పంచ్కి ఫోన్ చేశాడు. ఈ లోపు గ్రామస్థులు ఆ ప్రదేశానికి చేరుకుని.. ఆ దృశ్యాన్ని చూసి కలత చెందారు. పసిబిడ్డ ఏడుపు ఆపేందుకు గ్రామస్థులు ప్రయత్నం చేశారు.
చివరికి స్థానిక గ్రామానికి చెందిన ఓ బాలింత ఆ బిడ్డకు పాలు ఇచ్చింది. దీంతో ఆ పసిబిడ్డ ఏడవడం ఆపేశాడు. ఈ లోపు సర్పంచ్ అక్కడికి చేరుకుని.. జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం తెలియజేశాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పిల్లవాడిని షాద్నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. స్టేషన్కి వచ్చిన ఐసీడీఎస్ షాద్నగర్ సీడీపీఓ నాగమణి, సూపర్ వైజర్లు బాలుడ్ని పరిశీలించి.. ఆలనా పాలనా చూశారు. పిల్లవాడ్ని హైదరాబాద్లోని శిశు విహార్కు తరలిస్తున్నట్లు నాగమణి తెలిపారు. పసిబిడ్డ తల్లి ఎవరు? పుట్టిన వెంటనే ఆ ప్రదేశానికి తీసుకొచ్చింది ఎవరు? అసలు అమీర్ అనే వ్యక్తి ఎవరు? ఇలాంటి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: