ETV Bharat / state

Lands for Sale: తుర్కయాంజల్‌ ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్న సర్కారు - telangana news

Lands for Sale: హైదరాబాద్‌లో భూముల అమ్మకం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుర్కయాంజల్‌లో ఓఆర్​ఆర్​ లోపలవైపు ఉన్న ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్నట్టు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాటన్లు ఈ-వేలం పద్ధతిలో అమ్ముతామని పేర్కొన్నారు.

Lands for Sale: తుర్కయాంజల్‌ ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్న సర్కారు
Lands for Sale: తుర్కయాంజల్‌ ప్రభుత్వ ప్లాట్లను విక్రయించనున్న సర్కారు
author img

By

Published : May 29, 2022, 12:36 PM IST

Lands for Sale: ఆదాయ సమీకరణలో భాగంగా భూముల అమ్మకం మళ్లీ తెరపైకి వచ్చింది. తుర్కయాంజల్​లో ఓఆర్​ఆర్ లోపలవైపు ఉన్న ప్రభుత్వ ప్లాట్లు అమ్మనున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ట్విటర్​లో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాటన్లు ఈ వేలం పద్ధతిలో విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. తుర్కయంజాల్ లో మొత్తం 34 ప్లాట్లకు ఈ వేలం జరగనున్నట్టు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రతిని ఆయన ట్విటర్​లో పొందుపరిచారు. అందులో 600 నుంచి 700 గజాలు ఉన్నవి 14 ప్లాట్లు, 701 నుంచి 800 గజాలవి 10, 800 నుంచి 850 గజాలవి 5, 900 నుంచి 1060 గజాలవి 5 ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 31 నుంచి జూన్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని.... ప్రీ బిడ్డింగ్​ మీటింగ్ జూన్ 4, 6 తేదీల్లో నిర్వహించనున్నట్టు వివరించారు. జూన్ 30వ తేదీన ఈ-వేలం ప్రక్రియ సాగుతుందని పేర్కొన్న అరవింద్ కుమార్... రిజిస్ట్రేషన్ కోసం 1000 రూపాయలను ఆన్​లైన్​లో చెల్లించాలని ప్రకటనలో పొందుపరిచారు. వ్యక్తులు, లేక సంస్థలు ప్లాట్ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని.. అందుబాటు ధరలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్లు లభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

  • Opportunity for developers / builders / individuals to constructs apartment / multipurpose complexes - 34 plots (600-1060 sq yards) in Turkyamjal (within ORR)
    Encumbrance free, prime location, e-auction by MSTC pic.twitter.com/2ESxhMtZfd

    — Arvind Kumar (@arvindkumar_ias) May 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

Lands for Sale: ఆదాయ సమీకరణలో భాగంగా భూముల అమ్మకం మళ్లీ తెరపైకి వచ్చింది. తుర్కయాంజల్​లో ఓఆర్​ఆర్ లోపలవైపు ఉన్న ప్రభుత్వ ప్లాట్లు అమ్మనున్నట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ట్విటర్​లో పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేని ప్లాటన్లు ఈ వేలం పద్ధతిలో విక్రయించనున్నట్టు పేర్కొన్నారు. తుర్కయంజాల్ లో మొత్తం 34 ప్లాట్లకు ఈ వేలం జరగనున్నట్టు వివరించారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రతిని ఆయన ట్విటర్​లో పొందుపరిచారు. అందులో 600 నుంచి 700 గజాలు ఉన్నవి 14 ప్లాట్లు, 701 నుంచి 800 గజాలవి 10, 800 నుంచి 850 గజాలవి 5, 900 నుంచి 1060 గజాలవి 5 ప్లాట్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ నెల 31 నుంచి జూన్ 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని.... ప్రీ బిడ్డింగ్​ మీటింగ్ జూన్ 4, 6 తేదీల్లో నిర్వహించనున్నట్టు వివరించారు. జూన్ 30వ తేదీన ఈ-వేలం ప్రక్రియ సాగుతుందని పేర్కొన్న అరవింద్ కుమార్... రిజిస్ట్రేషన్ కోసం 1000 రూపాయలను ఆన్​లైన్​లో చెల్లించాలని ప్రకటనలో పొందుపరిచారు. వ్యక్తులు, లేక సంస్థలు ప్లాట్ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చని.. అందుబాటు ధరలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్లు లభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

  • Opportunity for developers / builders / individuals to constructs apartment / multipurpose complexes - 34 plots (600-1060 sq yards) in Turkyamjal (within ORR)
    Encumbrance free, prime location, e-auction by MSTC pic.twitter.com/2ESxhMtZfd

    — Arvind Kumar (@arvindkumar_ias) May 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.