రంగారెడ్డి జిల్లాలో రవాణాశాఖ అధికారులు వివిధ ప్రాంతాల్లో పాఠశాల బస్సులను తనిఖీ చేశారు. ఉదయం నుంచి నాలుగు బృందాలుగా ఏర్పడి పాఠశాల వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఫిట్నెస్ లేని 13 బస్సులను సీజ్ చేశారు. వీటితో పాటు మరో తొమ్మిది వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి ప్రవీణ్రావు తెలిపారు.
ఇదీ చూడండి : 'పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చట్ట వ్యతిరేకులు'