ETV Bharat / state

Rangareddy Honor Killing Case Update : కుమార్తె వరసయ్యే యువతితో ప్రేమాయణం.. చివరకు..!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 20, 2023, 12:02 PM IST

Rangareddy Honor Killing Case Update : ప్రేమకు కులం, మతం, ప్రాంతాలతో సంబంధం ఉండదు. అడ్డుగోడలు అసలే ఉండవు. మనుషుల మధ్య ఉన్న సరిహద్దులు.. మనసుల మధ్య అసలు లేనే లేవు. ఈ మధ్య తెగ వైరల్​గా మారిన పాకిస్థాన్​ నుంచి వచ్చిన సీమా హైదర్​ కథ.. అలాగే భారత్​ నుంచి పాకిస్థాన్​ వెళ్లిన అంజు ప్రేమగాథ.. పోలండ్​ నుంచి భారత్​కు వచ్చిన బార్బరా పోలాక్​ స్టోరీ. ఈ ముగ్గురు మహిళలు ఏకంగా ప్రేమ కోసం దేశ సరిహద్దులనే దాటారు. వీరి ప్రేమ కథలు అన్నీ సోషల్​ మీడియా వేదికగా జరిగితే.. తాజాగా మానవ సంబధాలకే మచ్చ తెచ్చేలా.. కుమార్తె వరసయ్యే యువతితో అనైతిక సంబంధం కొనసాగించిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Rangareddy Young Man Murder Case Update
Rangareddy Young Man Murder Case

Rangareddy Young Man Murder Case Update : కుమార్తె వరసయ్యే యువతితో అనైతిక సంబంధం కొనసాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి తండ్రి.. మరో నలుగురితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. గత నెల 15వ తేదీన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో యువకుడిని హత్య చేసి పరారైన నిందితులు.. నెల తర్వాత ఓ మహిళతో ఫోన్‌ మాట్లాడి పోలీసులకు చిక్కారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన కరణ్‌ కుమార్‌ (18) రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లిలో ఓ కోళ్ల ఫారం(Poultry farm)లో కూలీ పనులు చేస్తుంటాడు. అదే రాష్ట్రానికి చెందిన రంజిత్‌ కుమార్‌ కుటుంబం సహా నిర్దవెల్లికి ఉపాధి కోసం వచ్చి స్థానిక కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. కరణ్‌ కుమార్‌, రంజిత్‌ కుమార్‌ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరూ వరుసకు సోదరులు అవుతారు. వావి వరసలు మరిచి కరణ్‌ కుమార్‌.. రంజిత్‌ కుమార్‌ కుమార్తెను ప్రేమించాడు. వారి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

Young Man Murder Case News : విషయం తెలుసుకున్న యువతి తండ్రి రంజిత్‌.. కరణ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. తన కుమార్తె కరణ్​కి కూడా కుమార్తె అవుతుందని చెప్పాడు. ఇవేవీ కరణ్‌ పట్టించుకోకుండా.. కొద్దిరోజుల పాటు యువతిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. దీంతో యువతి తండ్రి కరణ్​ను గట్టిగా బెదిరించాడు. తర్వాత కరణ్‌ పనికోసం సిద్దిపేటకు వెళ్లాడు. అక్కడ పనిలో కుదిరాడు. అక్కడికెళ్లినా అతనిలో ఏ మాత్రం మార్పురాలేదు. ఆమెతో తనకు వివాహమైందంటూ సామాజిక మాధ్యమాల్లో(Social Media) ప్రచారం చేశాడు. యువతి నుదుట కుంకుమ పెట్టిన ఫోటోలు(Photos) పోస్టు చేసేవాడు. కరణ్​ పనులపై విసిగిపోయిన రంజిత్‌.. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తనకు పరిచయస్తులైన.. బిహార్‌కు చెందిన ముంతోశ్​ కుమార్‌, బబ్లూ, మరో ఇద్దరు మైనర్ల సాయం కోరాడు.

Young Man Murder Case
హత్యకు గురైన కరణ్​ కుమార్

Man Pulled Woman's clothes on the road Hyderabad : అమానుషం.. మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి బట్టలు చించేసి.. వివస్త్రను చేసి..

పని ఉందని పిలిపించి..: రంజిత్‌ పథకం ప్రకారం.. ఆగస్టు 15వ తేదీన కరణ్‌కు ఫోన్‌ చేశాడు. పొలంలో పని ఉంది రమ్మని చెప్పి పిలిపించి.. నిర్దవెల్లి-జూలపల్లి మధ్య రహదారి పక్కకు అతనిని తీసుకెళ్లాడు. దీంతో అక్కడే ఉన్నవారు బురద నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. అనంతరం యువడిని అక్కడే పాతిపెట్టి పరారయ్యారు. తన తమ్ముడు కనిపించడం లేదంటూ.. కరణ్‌ అన్న దీపక్‌ గత నెల 29వ తేదీన కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాలీసులు.. కేసు నమోదు చేసి కాల్‌ డేటా(Call Data) ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.

ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన పోలీసులు : చివరిసారిగా రంజిత్‌ కాల్‌ చేయడం, కరణ్‌ ఫోన్‌ సిగ్నల్‌(Phone Signal) నిర్దవెల్లి మధ్య ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాల అనంతరం యువకుడిని రంజిత్‌ హత్య చేసినట్లు రుజువైంది. ఈలోపే హత్యకు పాల్పడిన నిందితులు.. ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. వారు తమ ఫోన్లు స్విచాఫ్‌ చేయడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టమైంది. ఈ సమయంలోనే నిందితుల్లో ఒకరు యువతికి కాల్‌ చేసి స్విచాఫ్‌ చేశారు. సమాచారం అందుకున్న కేశంపేట పోలీసులు.. ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో నిందితులు తలదాచుకున్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితుల్ని రిమాండుకు.. ఇద్దరు మైనర్లను జువైనల్‌ హోం(Juvenile Home)కు తరలించారు.

Sarpanch Daughter Love Marriage : కుమార్తె ప్రేమ విహహం.. భర్త, అతని స్నేహితుల ఇళ్లను తగలబెట్టించిన తండ్రి

Facebook Love Story: ఫేస్​బుక్ ప్రేమకథా చిత్రమ్..! ఒక్కటైన చిత్తూరు యువకుడు శ్రీలంక యువతి

Rangareddy Young Man Murder Case Update : కుమార్తె వరసయ్యే యువతితో అనైతిక సంబంధం కొనసాగిస్తున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువతి తండ్రి.. మరో నలుగురితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. గత నెల 15వ తేదీన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో యువకుడిని హత్య చేసి పరారైన నిందితులు.. నెల తర్వాత ఓ మహిళతో ఫోన్‌ మాట్లాడి పోలీసులకు చిక్కారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన కరణ్‌ కుమార్‌ (18) రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లిలో ఓ కోళ్ల ఫారం(Poultry farm)లో కూలీ పనులు చేస్తుంటాడు. అదే రాష్ట్రానికి చెందిన రంజిత్‌ కుమార్‌ కుటుంబం సహా నిర్దవెల్లికి ఉపాధి కోసం వచ్చి స్థానిక కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. కరణ్‌ కుమార్‌, రంజిత్‌ కుమార్‌ ఒకే ప్రాంతానికి చెందినవారు. ఇద్దరూ వరుసకు సోదరులు అవుతారు. వావి వరసలు మరిచి కరణ్‌ కుమార్‌.. రంజిత్‌ కుమార్‌ కుమార్తెను ప్రేమించాడు. వారి ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

Young Man Murder Case News : విషయం తెలుసుకున్న యువతి తండ్రి రంజిత్‌.. కరణ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. తన కుమార్తె కరణ్​కి కూడా కుమార్తె అవుతుందని చెప్పాడు. ఇవేవీ కరణ్‌ పట్టించుకోకుండా.. కొద్దిరోజుల పాటు యువతిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లేవాడు. దీంతో యువతి తండ్రి కరణ్​ను గట్టిగా బెదిరించాడు. తర్వాత కరణ్‌ పనికోసం సిద్దిపేటకు వెళ్లాడు. అక్కడ పనిలో కుదిరాడు. అక్కడికెళ్లినా అతనిలో ఏ మాత్రం మార్పురాలేదు. ఆమెతో తనకు వివాహమైందంటూ సామాజిక మాధ్యమాల్లో(Social Media) ప్రచారం చేశాడు. యువతి నుదుట కుంకుమ పెట్టిన ఫోటోలు(Photos) పోస్టు చేసేవాడు. కరణ్​ పనులపై విసిగిపోయిన రంజిత్‌.. అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం తనకు పరిచయస్తులైన.. బిహార్‌కు చెందిన ముంతోశ్​ కుమార్‌, బబ్లూ, మరో ఇద్దరు మైనర్ల సాయం కోరాడు.

Young Man Murder Case
హత్యకు గురైన కరణ్​ కుమార్

Man Pulled Woman's clothes on the road Hyderabad : అమానుషం.. మద్యం మత్తులో నడిరోడ్డుపై యువతి బట్టలు చించేసి.. వివస్త్రను చేసి..

పని ఉందని పిలిపించి..: రంజిత్‌ పథకం ప్రకారం.. ఆగస్టు 15వ తేదీన కరణ్‌కు ఫోన్‌ చేశాడు. పొలంలో పని ఉంది రమ్మని చెప్పి పిలిపించి.. నిర్దవెల్లి-జూలపల్లి మధ్య రహదారి పక్కకు అతనిని తీసుకెళ్లాడు. దీంతో అక్కడే ఉన్నవారు బురద నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి హతమార్చారు. అనంతరం యువడిని అక్కడే పాతిపెట్టి పరారయ్యారు. తన తమ్ముడు కనిపించడం లేదంటూ.. కరణ్‌ అన్న దీపక్‌ గత నెల 29వ తేదీన కేశంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పాలీసులు.. కేసు నమోదు చేసి కాల్‌ డేటా(Call Data) ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు.

ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన పోలీసులు : చివరిసారిగా రంజిత్‌ కాల్‌ చేయడం, కరణ్‌ ఫోన్‌ సిగ్నల్‌(Phone Signal) నిర్దవెల్లి మధ్య ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాల అనంతరం యువకుడిని రంజిత్‌ హత్య చేసినట్లు రుజువైంది. ఈలోపే హత్యకు పాల్పడిన నిందితులు.. ఇతర ప్రాంతాలకు పరారయ్యారు. వారు తమ ఫోన్లు స్విచాఫ్‌ చేయడంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టమైంది. ఈ సమయంలోనే నిందితుల్లో ఒకరు యువతికి కాల్‌ చేసి స్విచాఫ్‌ చేశారు. సమాచారం అందుకున్న కేశంపేట పోలీసులు.. ఏపీలోని ప్రకాశం జిల్లా అద్దంకిలో నిందితులు తలదాచుకున్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు. హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితుల్ని రిమాండుకు.. ఇద్దరు మైనర్లను జువైనల్‌ హోం(Juvenile Home)కు తరలించారు.

Sarpanch Daughter Love Marriage : కుమార్తె ప్రేమ విహహం.. భర్త, అతని స్నేహితుల ఇళ్లను తగలబెట్టించిన తండ్రి

Facebook Love Story: ఫేస్​బుక్ ప్రేమకథా చిత్రమ్..! ఒక్కటైన చిత్తూరు యువకుడు శ్రీలంక యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.