రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని ఆర్బీ నగర్, మధురానగర్, ఎయిర్పోర్ట్ కాలనీల్లో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పర్యటించారు. పురపాలిక ఎన్నికల్లో పోటీ చేసే తెరాస అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
ముందుచూపుతో సీఎం కేసీఆర్... శంషాబాద్ను వార్డులుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రచించారని ఎమ్మెల్యే తెలిపారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సక్రమంగా పనిచేయకపోతే... మళ్లీ ఓటు అడగనని హామీ ఇచ్చారు.
- ఇదీ చూడండి : 'తెరాస మోసాలే... పుర ఎన్నికల్లో మన అస్త్రాలు'