ETV Bharat / state

'పనిచేయకపోతే... మళ్లీ నా ముఖం చూపించను' - రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్

మరో నాలుగేళ్లు పదవిలోనే ఉంటానని, ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరిస్తానని రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​ అన్నారు. పురపాలిక ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

rajendranagar mla prakash goud campaign for municipal elections
శంషాబాద్​లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రచారం
author img

By

Published : Jan 16, 2020, 6:46 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని ఆర్​బీ నగర్​, మధురానగర్​, ఎయిర్​పోర్ట్​ కాలనీల్లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​ పర్యటించారు. పురపాలిక ఎన్నికల్లో పోటీ చేసే తెరాస అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ముందుచూపుతో సీఎం కేసీఆర్​... శంషాబాద్​ను వార్డులుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రచించారని ఎమ్మెల్యే తెలిపారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సక్రమంగా పనిచేయకపోతే... మళ్లీ ఓటు అడగనని హామీ ఇచ్చారు.

శంషాబాద్​లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రచారం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లోని ఆర్​బీ నగర్​, మధురానగర్​, ఎయిర్​పోర్ట్​ కాలనీల్లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్​ పర్యటించారు. పురపాలిక ఎన్నికల్లో పోటీ చేసే తెరాస అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ముందుచూపుతో సీఎం కేసీఆర్​... శంషాబాద్​ను వార్డులుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు రచించారని ఎమ్మెల్యే తెలిపారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా సక్రమంగా పనిచేయకపోతే... మళ్లీ ఓటు అడగనని హామీ ఇచ్చారు.

శంషాబాద్​లో రాజేంద్రనగర్​ ఎమ్మెల్యే ప్రకాశ్​ గౌడ్ ప్రచారం
Intro:TG_HYD_34_16_SHAMSHABAD MLA PRACHARAM_AB_TS10020Body:చిన్న చిన్న వార్డుల్లో కౌన్సిలర్స్ ఉన్నట్లయితే ప్రతి వార్డు అభివృద్ధి చెందుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ లోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆర్ బి నగర్. మధురానగర్. ఎయిర్పోర్ట్ కాలనీ. సిద్ధాంతి. రాళ్లగూడ. తొండపల్లి. ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం రోడ్ షో నిర్వహించారు. ప్రతి వార్డు మెంబర్ ని వెంటపెట్టుకుని ఇంటింటి ప్రచారం ప్రకాష్ గౌడ్ నిర్వహించారు. వారితోపాటు జడ్పిటిసి తన్వి రాజు. ఎంపీపీ యాదమ్మ శ్రీనివాస్ . పార్టీ సీనియర్ నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు. ఆర్ బి నగర్ కాలనీలో స్వచ్ఛందంగా కాలనీవాసులు అడుగడుగున ప్రకాష్ గౌడ్ కి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు ఆలోచించి శంషాబాద్ లో వార్డులుగా ఏర్పాటు చేసి అభివృద్ధి చెందేందుకు ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేశాడని ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. నేను ఇంక నాలుగేళ్లు పదవిలో ఉంటాను మీ సమస్యలు ఏమున్నా వెంటనే తీరుస్తానని ఓటర్లను కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఇప్పుడు నేను పని చేయకుంటే రాబోయే ఎన్నికల్లో నేను మిమ్మల్ని ఓటు అడగను నేను హామీ ఇస్తున్నాను అని ఓటర్లకు తెలిపారు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి అభ్యర్థి తన వార్డులోని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి వివరించాలని అభ్యర్థులను అభ్యర్థించారు.Conclusion:బైట్ ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.