ETV Bharat / state

మంత్రి హరీశ్​ను కలిసిన పటాన్​చెరు డివిజన్ కార్పొరేటర్

author img

By

Published : Dec 6, 2020, 9:10 AM IST

గ్రేటర్ హైదరాబాద్​ శివారులోని పటాన్​చెరు డివిజన్ కార్పొరేటర్​గా గెలిచిన మెట్టు కుమార్​యాదవ్.. ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో తన గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

patancheru-division-corporator-kumar-yadav-met-minister-harish-rao
మంత్రి హరీశ్​ను కలిసిన పటాన్​చెరు డివిజన్ కార్పొరేటర్

రంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్ కార్పొరేటర్​గా గెలిచిన మెట్టు కుమార్​యాదవ్ రాష్ట్ర మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్​లో తనకు మద్దతుగా నిలిచి, తన గెలుపునకు కృషి చేసిన మంత్రి హరీశ్, ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

వారి మద్దతు వల్లే 6083 ఓట్ల మెజార్టీతో గెలిచానని కుమార్ యాదవ్ అన్నారు. తన గెలుపునకు సహకరించిన మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డిలను సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్పొరేటర్​గా గెలిచిన కుమార్​కు హరీశ్, భూపాల్ రెడ్డిలు అభినందనలు తెలిపి మిఠాయి తినిపించారు.

రంగారెడ్డి జిల్లా పటాన్​చెరు డివిజన్ కార్పొరేటర్​గా గెలిచిన మెట్టు కుమార్​యాదవ్ రాష్ట్ర మంత్రి హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజన్​లో తనకు మద్దతుగా నిలిచి, తన గెలుపునకు కృషి చేసిన మంత్రి హరీశ్, ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.

వారి మద్దతు వల్లే 6083 ఓట్ల మెజార్టీతో గెలిచానని కుమార్ యాదవ్ అన్నారు. తన గెలుపునకు సహకరించిన మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డిలను సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. కార్పొరేటర్​గా గెలిచిన కుమార్​కు హరీశ్, భూపాల్ రెడ్డిలు అభినందనలు తెలిపి మిఠాయి తినిపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.