రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఆగస్టు రెండు 2018లో 9 గ్రామపంచాయతీల కలయికతో నూతనంగా ఏర్పడింది. మున్సిపాలిటీలో 50వేల 255 ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
నగరానికి దగ్గరగా ఉండటం... సాగర్ రహదారికి ఆనుకొని ఉండటంతో పట్టణీకరణ చాలా వేగవంతంగా జరిగింది. అందుకు తగ్గట్టుగా మౌలిక వసతులు లేకపోవడం వల్ల అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యులు ఉన్నాయి. మున్సిపాలిటీ ఇరవై నాలుగు వార్డులుగా విభజించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటికీ రిజర్వేషన్ల ఖరారు కాకపోవడం వల్ల ఆశావహులు అంతా అయోమయంలో ఉన్నారు. ఓవైపు నామినేషన్ల తేదీ ఖరారు చేసినప్పటికీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం వల్ల ఆయా వార్డులలో ఏ రిజర్వేషన్లు వస్తాయో తెలియక ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ పరిస్థితి నెలకొంది.
- ఇవీ చూడండి: 'నేను సీఎం అవుతాననే చర్చే అవసరం లేదు"