ETV Bharat / state

'స్వశక్తితో మహిళలు ఎదగాలి'

author img

By

Published : Mar 8, 2020, 8:58 PM IST

ప్రతి మహిళ స్వశక్తితో జీవితంలో ఎదగాలని రంగారెడ్డి జిల్లా కోర్టు మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సరళారెడ్డి అన్నారు. తుర్కయంజాల్​ మున్సిపాలిటీ పరిధిలో కాళోజీ స్మారక కమిటీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

Women's day
Women's day
'స్వశక్తితో మహిళలు జీవితంలో ఎదగాలి'

ప్రతి మహిళా పురుషులతో సమానంగా రాణించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది సరళారెడ్డి తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కాళోజీ స్మారక కమిటీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. మహిళలు తమ భద్రత కొరకు ఆర్థికంగా ఎదగాలన్నారు.

ప్రస్తుత సమాజంలో ఎన్నో అవకాశాలున్నాయని... వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళా రక్షణ కోసం చట్టాలను మరింత పటిష్ఠం చేసి... సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వేడుకల్లో భాగంగా మహిళా న్యాయవాది సరళా రెడ్డి తోపాటు కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులను స్థానిక తెరాస నాయకుడు బల్​దేవ్ రెడ్డి సన్మానించారు.

ఇదీ చూడండి: హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు

'స్వశక్తితో మహిళలు జీవితంలో ఎదగాలి'

ప్రతి మహిళా పురుషులతో సమానంగా రాణించాలని రంగారెడ్డి జిల్లా కోర్టు మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది సరళారెడ్డి తెలిపారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో కాళోజీ స్మారక కమిటీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆమె పాల్గొన్నారు. మహిళలు తమ భద్రత కొరకు ఆర్థికంగా ఎదగాలన్నారు.

ప్రస్తుత సమాజంలో ఎన్నో అవకాశాలున్నాయని... వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు. మహిళా రక్షణ కోసం చట్టాలను మరింత పటిష్ఠం చేసి... సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు. వేడుకల్లో భాగంగా మహిళా న్యాయవాది సరళా రెడ్డి తోపాటు కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులను స్థానిక తెరాస నాయకుడు బల్​దేవ్ రెడ్డి సన్మానించారు.

ఇదీ చూడండి: హోలీ సందర్భంగా కుస్తీ పోటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.