రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. షాబాద్ మండలంలోని నాగర్గూడ ఈసీ వాగు ఉద్దృతంగా ప్రవహిస్తోంది. గత ఐదేళ్లలో ఈ ఏడాది ఈసీ వాగు నిండుకుండలా ప్రవహిస్తోంది. నీటితో కళకళలాడతున్న నాగర్గూడ ఈసీ వాగును చూసేందుకు సందర్శకులు వస్తున్నారు.
శంకర్పల్లి పట్టణానికి సమీపంలో మూసీ వాగు, తీగల వాగు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు శంకర్పల్లి పట్టణంలోకి చేరింది. ఇళ్లలోకి నీరు చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొందరి నివాసాల్లో నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులు సూచించారు.
ఇవీ చూడండి: హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం