గడ్డి అన్నారం మార్కెట్ను తుర్కయంజాల్ నుంచి కొహెడకు తరలించగా.. గాలివాన వల్ల కొహెడ తాత్కాలిక మార్కెట్ పూర్తిగా ధ్వంసం అయింది. చేసేదేంలేక.. తిరిగి గడ్డి అన్నారం మార్కెట్ను మళ్లీ ప్రారంభించారు. కొనుగోలుదారులు భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు లేకుండా మార్కెట్కు వస్తుండడం వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందేమో అన్న అనుమానంతో గడ్డి అన్నారం మార్కెట్ను అధికారులు మూసేశారు.
వ్యాపారులు, రైతులు చేసేదేం లేక.. అక్కడే ఉన్న గిడ్డంగులను అద్దెకు తీసుకొని అందులో తాము తెచ్చిన పండ్లు, కాయలను స్టోరేజ్ చేసి రోడ్ల మీదే అమ్మకాలు మొదలు పెట్టారు. మామిడి సీజన్ మరో వారం, పదిరోజులు మాత్రమే ఉండడం వల్ల ప్యాకింగ్, స్టోరేజీ సదుపాయాలు లేక.. మామిడి వ్యాపారులు రోడ్డు మీదే అమ్మకాలు చేపట్టారు. మార్కెటింగ్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఎన్నడూ లేనంతగా ఈసారి నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆరు గాయాలుంటే ఒకటే అంటారేం..?:హైకోర్టు