ముంచుకొస్తున్న కరోనా ముప్పును కట్టడి చేసేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రజలు, అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటిలో మున్సిపల్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని... ఎవరైనా నిత్యవసర వస్తువులు, కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా తెరాస కౌన్సిలర్లు సీఎం రిలీఫ్ ఫండ్కు తమ రెండు నెలల జీతం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అహ్మద్ సఫీఉల్లాహ్, ఛైర్మన్ అబ్దుల్లాహ్ సాది, వైస్ ఛైర్పర్సన్ ఫర్హానా నాజ్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఇవీచూడండి: తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య