ETV Bharat / state

ట్రాన్స్​జెండర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సీపీ

author img

By

Published : May 23, 2021, 7:09 AM IST

కరోనా వేళ సైబరాబాద్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ట్రాన్స్​జెండర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

CP  sajjanar distributed essentials to transgender, cyberabad cp sajjanar
ట్రాన్స్​జెండర్లకు నిత్యావసరకులు సీపీ సజ్జనార్, సైబరాబాద్ సీపీ

హైదరాబాద్​లోని ట్రాన్స్‌జెండర్లకు తాము అండగా ఉన్నామంటూ సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చారు. దాదాపు 145 మంది ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్​ను ప్రపంచంలో తొలిసారిగా సైబరాబాద్​లో ఏర్పాటు చేశామని సీపీ అన్నారు. ఈ డెస్క్ ద్వారా వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డీసీపీ, మాదాపుర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్ రావు, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా సోకిన వారు గుండెపోటుతో మరణించడానికి కారణమదే!

హైదరాబాద్​లోని ట్రాన్స్‌జెండర్లకు తాము అండగా ఉన్నామంటూ సైబరాబాద్ పోలీసులు ముందుకు వచ్చారు. దాదాపు 145 మంది ట్రాన్స్‌జెండర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలోని ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్​ను ప్రపంచంలో తొలిసారిగా సైబరాబాద్​లో ఏర్పాటు చేశామని సీపీ అన్నారు. ఈ డెస్క్ ద్వారా వారికి ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డీసీపీ, మాదాపుర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్ రావు, గచ్చిబౌలి ఇన్​స్పెక్టర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా సోకిన వారు గుండెపోటుతో మరణించడానికి కారణమదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.