ETV Bharat / state

నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​

author img

By

Published : Dec 1, 2019, 7:36 PM IST

శంషాబాద్​లో పశువైద్యురాలి కుటుంబసభ్యలను కాంగ్రెస్​ సీనియర్​ వీహెచ్​ పరామర్శించారు. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

congress leader vh spoke on shamshabad incident
నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​

ప్రస్తుతం ఉన్న చట్టాలు అత్యాచార బాధితులకు పనిచేయవని... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులపై నమ్మకం లేదని... అక్కడ బాధితులకు న్యాయం జరగదని ఆరోపించారు. నిర్భయచట్టం పనికిరాదని... ఈ రోజుల్లో ఇంకా పటిష్టమైన చట్టం తేవాలని వీహెచ్‌ పేర్కొన్నారు. శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలి నివాసానికి వచ్చిన వీహెచ్... ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ అన్యాయం జరిగిందని వీహెచ్ తెలిపారు. హోంమంత్రి మాటలు కూడా సరికాదన్నారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగానే టోల్‌గేట్‌ వద్దకు పోలీసులు వెళితే న్యాయం జరిగేదన్నారు. ట్విట్టర్‌లో సానుభూతి సందేశాలు పంపడం కాదని బాధితులతో మాట్లాడాలని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.

నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​

ఇవీ చూడండి: 'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా'

ప్రస్తుతం ఉన్న చట్టాలు అత్యాచార బాధితులకు పనిచేయవని... ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులపై నమ్మకం లేదని... అక్కడ బాధితులకు న్యాయం జరగదని ఆరోపించారు. నిర్భయచట్టం పనికిరాదని... ఈ రోజుల్లో ఇంకా పటిష్టమైన చట్టం తేవాలని వీహెచ్‌ పేర్కొన్నారు. శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలి నివాసానికి వచ్చిన వీహెచ్... ఆమె కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువ అన్యాయం జరిగిందని వీహెచ్ తెలిపారు. హోంమంత్రి మాటలు కూడా సరికాదన్నారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగానే టోల్‌గేట్‌ వద్దకు పోలీసులు వెళితే న్యాయం జరిగేదన్నారు. ట్విట్టర్‌లో సానుభూతి సందేశాలు పంపడం కాదని బాధితులతో మాట్లాడాలని కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.

నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలి: వీహెచ్​

ఇవీ చూడండి: 'అమానవీయ ఘటన విని నిద్రలేని రాత్రి గడిపా'

TG_Hyd_50_01_VH_On_Priyankarerddy_Issue_AB_3181965 Reporter: Praveen Kumar Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) ప్రస్తుతం ఉన్న చట్టాలు అత్యాచార బాధితులకు పనిచేయవని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని కాంగ్రెస్ సినీయర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నారు. ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులపై నమ్మకం లేదని అక్కడ బాధితులకు న్యాయం జరుగదన్నారు. నిర్భయచట్టం పనికిరాదని...ఈ రోజుల్లో ఇంకా పటిష్టమైన చట్టం తేవాలని వీహెచ్‌ పేర్కొన్నారు. శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు నివాసానికి వచ్చిన వీహెచ్ అమె కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు ప్రియాంక రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం ద్వారా ఎక్కువ అన్యాయం జరిగిందని వీహెచ్ తెలిపారు. హోంమంత్రి మాటలు కూడా సరికాదన్నారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగానే టోల్‌గేట్‌ వద్దకు పోలీసులు వెళితే న్యాయం జరిగేదన్నారు. ట్విట్టర్‌లో సానుభూతి సందేశాలు పంపడం కాదని బాధితులతో మాట్లాడాలని కేటీఆర్‌నుద్దేశించి విమర్శించారు. బైట్: వి హనుమంతరావు, కాంగ్రెస్ సినీయర్ నేత
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.