రంగారెడ్డి జిల్లా పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలోని రావిరాల గేట్ వద్ద నుంచి ఆవులు, ఎద్దులతో నిండి ఉన్న బొలెరో వాహనంను రాష్ట్ర గోరక్ష దళ్ సభ్యులు గుర్తించారు. వారు ఆ వాహనాన్ని ఆపి పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.
నల్గొండ జిల్లా మాల్మల్లె పల్లి నుంచి బొలెరో వాహనంలో కిక్కిరిసిన ఎనిమిది మూగజీవులను తీసుకొస్తున్నారు. ఈ ఘటనపై దీపక్సింగ్ ఫిర్యాదుతో పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : గర్భిణీ పట్ల ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం.. గేటు వద్దే ప్రసవం