రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలివేరి దేవయ్య జిల్లాలో హోం గార్డ్గా విధులు నిర్వహిస్తున్నారు. దేవయ్య దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె డిగ్రీ పూర్తి చేయగా , కుమారుడు ఏడో తరగతి చదువుతున్నాడు. గత నెల 15న కరోనా విధి నిర్వహణలో ఉండగా వడదెబ్బతో చనిపోయాడు.
హోమ్ గార్డ్ దేవయ్య మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వ్యక్తిగతంగా రూ. ఐదు లక్షల చెక్కు అందజేశారు. దేవయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని మంత్రి భరోసానిచ్చారు. అలాగే దేవయ్య కుమార్తె సిలివేరి నవ్యకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మంత్రి తారకరామారావు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వేములవాడ రూరల్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో సిలివేరి నవ్యకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఈజీఎస్ మండల కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం కల్పించారు.
"కష్టకాలంలో తమను ఆదుకున్న కేటీఆర్కు జీవితాంత రుణపడి ఉంటాం. ఆర్థిక సహకరారంతో పాటు ఉద్యోగం ఇప్పించినందుకు కేటీఆర్ సారుకు ధన్యవాదాలు."
-సిలివేరి నవ్య, దేవయ్య కుమార్తె
ఇదీ చదవండి: మెదక్ జిల్లాలో బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడు