పెద్దపల్లి జిల్లా మంథనిలో రెండో విడతలో 16 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టమధు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పల్లెకు పారిశుద్ధ్యం అనే కార్యక్రమంలో భాగంగా చెత్తను సేకరించేందుకు గ్రామానికో ట్రాక్టర్ను కేటాయించినట్లు ఆయన తెలిపారు. పల్లెలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని... స్థానికులు కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే పారిశుధ్యం సాధ్యమని పుట్టమధు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..