ETV Bharat / state

'ప్రజలు బాధ్యతగా ఉంటేనే పారిశుద్ధ్యం సాధ్యం'

author img

By

Published : Feb 4, 2020, 5:35 PM IST

గ్రామాల ప్రజలు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్​ పుట్టమధు తెలిపారు. రెండో విడతలో భాగంగా 16 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేశారు.

TRACTORS DISTRIBUTION BY ZP CHAIRMAN IN MANTHANI
TRACTORS DISTRIBUTION BY ZP CHAIRMAN IN MANTHANI

పెద్దపల్లి జిల్లా మంథనిలో రెండో విడతలో 16 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్​ ఛైర్మన్ పుట్టమధు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పల్లెకు పారిశుద్ధ్యం అనే కార్యక్రమంలో భాగంగా చెత్తను సేకరించేందుకు గ్రామానికో ట్రాక్టర్​ను కేటాయించినట్లు ఆయన తెలిపారు. పల్లెలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని... స్థానికులు కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే పారిశుధ్యం సాధ్యమని పుట్టమధు స్పష్టం చేశారు.

'ప్రజలు బాధ్యతగా ఉంటేనే పారిశుద్ధ్యం సాధ్యం'

ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..

పెద్దపల్లి జిల్లా మంథనిలో రెండో విడతలో 16 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్​ ఛైర్మన్ పుట్టమధు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పల్లెకు పారిశుద్ధ్యం అనే కార్యక్రమంలో భాగంగా చెత్తను సేకరించేందుకు గ్రామానికో ట్రాక్టర్​ను కేటాయించినట్లు ఆయన తెలిపారు. పల్లెలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని... స్థానికులు కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే పారిశుధ్యం సాధ్యమని పుట్టమధు స్పష్టం చేశారు.

'ప్రజలు బాధ్యతగా ఉంటేనే పారిశుద్ధ్యం సాధ్యం'

ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.