ETV Bharat / state

"మేము ఇక్కడికి చావడానికి రాలేదు" - labours dharna at peddapalli collectarate

పెద్దపల్లి జిల్లా కాట్నపల్లిలోని ఏఆర్​బీ ఇటుక బట్టీలో పనిచేసే కార్మికుడిపై యజమాని దాడిని నిరసిస్తూ కూలీలు ఆందోళన చేపట్టారు. ఒడిశా నుంచి ఇక్కడికి చావడానికి రాలేదని.. పొట్టకూటి కోసం పనిచేసుకోవడానికి వచ్చామని ఆవేదన చెందారు. తమకు న్యాయం చేయాలని కలెక్టరేట్​ వద్ద నిరసనకు దిగారు.

"మేము ఇక్కడికి చావడానికి రాలేదు"
author img

By

Published : May 12, 2019, 7:40 PM IST

"మేము ఇక్కడికి చావడానికి రాలేదు"

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలం కాట్నపల్లిలోని ఏఆర్​బీ ఇటుక బట్టీలో పనిచేసే సురాన్​ అనే కూలీ ఒంట్లో బాగాలేక పోవడం వల్ల ఈరోజు పనికి వెళ్లలేదు. ఆగ్రహానికి గురైన యజమాని అవినాష్​ సురాన్​పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సొమ్మసిల్లి కిందపడ్డ అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. బట్టీ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూలీలంతా పెద్దపల్లి కలెక్టరేట్​ వద్ద ఆందోళనకు దిగారు. అవినాష్​ తమపైన దాడికి పాల్పడడం ఇది మొదటి సారి కాదని ఇప్పటికే అతని చేతిలో ఇద్దరు కూలీలు మృతిచెందారని ఆరోపించారు. తాము ఒడిశా నుంచి ఇక్కడకు చావడానికి రాలేదని.. పొట్టకూటికోసం పనిచేసుకోవడానికి వచ్చామన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : ఐపీఎల్​ తొలి సీజన్​లో ధోని ధరెంతంటే..?

"మేము ఇక్కడికి చావడానికి రాలేదు"

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలం కాట్నపల్లిలోని ఏఆర్​బీ ఇటుక బట్టీలో పనిచేసే సురాన్​ అనే కూలీ ఒంట్లో బాగాలేక పోవడం వల్ల ఈరోజు పనికి వెళ్లలేదు. ఆగ్రహానికి గురైన యజమాని అవినాష్​ సురాన్​పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సొమ్మసిల్లి కిందపడ్డ అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. బట్టీ యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూలీలంతా పెద్దపల్లి కలెక్టరేట్​ వద్ద ఆందోళనకు దిగారు. అవినాష్​ తమపైన దాడికి పాల్పడడం ఇది మొదటి సారి కాదని ఇప్పటికే అతని చేతిలో ఇద్దరు కూలీలు మృతిచెందారని ఆరోపించారు. తాము ఒడిశా నుంచి ఇక్కడకు చావడానికి రాలేదని.. పొట్టకూటికోసం పనిచేసుకోవడానికి వచ్చామన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి : ఐపీఎల్​ తొలి సీజన్​లో ధోని ధరెంతంటే..?

Intro:ఫైల్: TG_KRN_41_12_ETUKA BATTI KULINA AGRAHAM_AVBB_C6
రిపోర్టర్: లక్ష్మణ్, పెద్దపల్లి, 8008573603
యాంకర్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని ఏ.ఆర్.బి ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుడి పై యజమాని చేసిన దాడిని నిరసిస్తూ కూలీలంతా ఆందోళన నిర్వహించారు. ఏఆర్బిట్ కాబట్టి లో పనిచేసే సురాన్ అనే కూలి కి ఈరోజు ఒంట్లో బాగా లేకపోవడంతో పనికి రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఇటుక బట్టీల యజమాని అవినాష్ కూలి సురాన్ పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో కూలి సురాన్ సొమ్మసిల్లి కింద పడిపోయాడు ఈ విషయాన్ని తెలుసుకున్న మిగతా కూలీలంతా యాజమాని తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలి పై దాడికి పాల్పడిన యజమాని పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయం కి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీల నుంచి సుమారు 14 కిలో మీటర్లు ఉన్న పెద్దపల్లి కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ బయలుదేరారు. తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుండా రాజీవ్ రహదారి గుండా నడుచుకుంటూ వెళ్ళగా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కూలీలు ఇందుకు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక పోలీసులు సైతం కూలీల వెంట పరుగులు పెట్టారు. ఇటుక బట్టీ యజమాని చేతిలో చావు దెబ్బలు తిన్న కూలీ సురాన్ ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూలీలంతా ఒడిశాకు చెందిన వారు కావడంతో యజమాని దాడిని నిరసిస్తూ తమ సొంత రాష్ట్రమైన ఒడిశాకు పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
బైట్: బాధిత కూలి బంధువు
బైట్: బాధిత కూలి బంధువు


Body:లక్ష్మణ్


Conclusion:పెద్దపల్లి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.