నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సన్రైజ్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రారంభించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తే.. పేద ప్రజలు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోగలుగుతారని తెలిపారు. త్వరలోనే తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్, పలువురు స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భవననిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతివ్వాలి: కేటీఆర్