రైతులకు సన్నరకాల వరి విత్తనాల కొరత లేదని తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ ఎండీ కేశవులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి, ఏ.కోడూరు గ్రామాల ప్రాథమిక సహకార సంఘాల గోదాములను తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి విత్తనాల విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్కు సంబంధించిన గోడ పత్రికను కలెక్టర్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు.
వానాకాలం వరిలో సన్న రకాలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున వరి సాగు అవుతుందని... అందులో సన్నరకానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. తద్వారా మార్కెట్లో ఆ ధాన్యానికి డిమాండ్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వ్యవసాయ శాఖ సిబ్బంది ఉన్నారు.
ఇదీ చదవండి: Police Stations: కార్పొరేట్ కార్యాలయం కాదు పోలీస్ స్టేషన్