దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రారంభించారని నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కుల, మత, వర్గ భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సీఎం ఆదుకుంటున్నారని తెలిపారు.
వర్ని మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా క్రైస్తవ సోదర సోదరిమణులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. లబ్ధిదారులైన 27 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఇదీ చదవండి:మహారాష్ట్రలో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం