నిజామాబాద్ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు పట్టణ పోలీసు కమిషనర్ కార్తికేయ వెల్లడించారు. సిబ్బంది, ఏజెంట్ల కోసం మూడు పార్కింగ్ స్థలాలతోపాటు ఐదు చోట్ల చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. కమిషనరేట్ పరిధిలో ఇవాళ రాత్రి నుంచి ఎల్లుండి వరకు 144 సెక్షన్ విధించామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద వంద మీటర్ల లోపు నో వెహికిల్ జోన్గా ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, మీడియాకు వేర్వేరుగా ద్వారాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఇందూరు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు భారీ ఏర్పాట్లు