గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో మతసామరస్యం వెల్లివిరిసింది. మతాలకతీతంగా లంబోదరుడి సేవలో భక్తులు తరిస్తారు. అందుకు నిదర్శనమే ఈ ఘటన. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ గ్రామంలో వినాయకుడి వద్ద లడ్డు వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన మీర్జా లతీఫ్ బేగ్, నజీర్ బేగ్లు గణేశ్ లడ్డు వేలంపాట (Muslims in Ganesh Laddu auction)లో రూ. 20వేలకు దక్కించుకుని మతసామరస్యాన్ని చాటుకున్నారు. వినాయకుడి లడ్డును వేలంలో దక్కించుకోవడం తమకు సంతోషంగా ఉందని వారు తెలిపారు.
ఇదీ చూడండి: Ganesh Immersion Hyderabad: హైదరాబాద్లో గణేశుల శోభాయాత్ర ఏరియల్ వ్యూ చూశారా..?