ETV Bharat / state

తీరని వేదన.. ఏం జరిగిందో తెలియక మహేశ్ భార్య ఆందోళన

author img

By

Published : Nov 9, 2020, 2:46 PM IST

కట్టుకున్న వాడితో జీవితాన్ని అందంగా ఊహించుకొని, ఎన్నో ఆశలతో మెట్టింట అడుగు పెట్టిన ఆమెకి రెండేళ్లకే తన జీవితం మోడుబారిపోయింది. కశ్మీర్​లో శత్రుమూకతో ఎదురుకాల్పుల్లో పోరాడి భర్త వీరమరణం పొందాడని తెలియని ఆ భార్య తన ఇంటి సభ్యులు ఎందుకు ఏడుస్తున్నారో తెలియని సందిగ్ధంలో ఉండిపోయింది. 'నీ భర్త ఇక రాలేడు' అని చెప్పలేక వీరజవాన్​ మహేశ్​​ తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన అక్కడున్న వారిని కలిచివేసింది.

jawan-mahesh-wife-reached-to-his-home-village
వీరజవాన్​ మహేశ్​​ స్వగ్రామానికి చేరుకున్న భార్య సుహాసిని

కశ్మీర్​లో ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన మహేశ్​ భార్య సుహాసిని హైదరాబాద్ నుంచి భర్త స్వగ్రామం నిజామాబాద్​ జిల్లా వేల్పూర్ మండలం కోమన్​పల్లికి చేరుకుంది. భర్త మరణవార్త తెలియని సుహాసిని.. ప్రమాదం జరిగిందనే కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకుంది.

ఇంటికి చేరుకున్న తర్వాత బంధువులు అందరూ ఉండటంతో ఏం జరిగిందని అక్కుడున్న వారిని ప్రశ్నించింది. అనంతరం లోపలికి వెళ్లాక మహేశ్​ తల్లిదండ్రులు సుహాసినిని చూసి బోరున విలపించారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆమె వారిని ఏమైందని ప్రశ్నించడం అక్కడున్న వారిని కలిచివేసింది.

తీరని వేదన.. ఏం జరిగిందో తెలియక భార్య ఆందోళన

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి

కశ్మీర్​లో ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన మహేశ్​ భార్య సుహాసిని హైదరాబాద్ నుంచి భర్త స్వగ్రామం నిజామాబాద్​ జిల్లా వేల్పూర్ మండలం కోమన్​పల్లికి చేరుకుంది. భర్త మరణవార్త తెలియని సుహాసిని.. ప్రమాదం జరిగిందనే కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకుంది.

ఇంటికి చేరుకున్న తర్వాత బంధువులు అందరూ ఉండటంతో ఏం జరిగిందని అక్కుడున్న వారిని ప్రశ్నించింది. అనంతరం లోపలికి వెళ్లాక మహేశ్​ తల్లిదండ్రులు సుహాసినిని చూసి బోరున విలపించారు. ఏం జరుగుతుందో అర్థం కాక ఆమె వారిని ఏమైందని ప్రశ్నించడం అక్కడున్న వారిని కలిచివేసింది.

తీరని వేదన.. ఏం జరిగిందో తెలియక భార్య ఆందోళన

ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 857 కరోనా కేసులు.. నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.