కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక కొందరిలో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే రక్తం గడ్డ కట్టే అవకాశముందని నిజామాబాద్లోని ప్రముఖ కార్డియాలజిస్ట్ డా.గోపీకృష్ణ తెలిపారు. అయితే గుండె సంబంధ వ్యాధులున్న వారు టీకా తీసుకుంటే వైరస్ ముప్పు తప్పించుకునే అవకాశముందన్నారు. ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో పలువురి సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని డాక్టర్ గోపి కృష్ణ సూచించారు. కరోనాను జయించినా తరువాత కాలంలో వ్యాక్సిన్ తీసుకోకుంటే సమస్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చూడండి: తెలంగాణకు తాళం.. కొనసాగుతున్న లాక్డౌన్