ETV Bharat / state

ప్రైవేటు కొవిడ్​ ఆస్పత్రుల్లో అదనపు కలెక్టర్​ తనిఖీలు - నిజామాబాద్​ కరోనా వార్తలు

నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రైవేటు కొవిడ్​ ఆస్పత్రుల్లో జిల్లా అదనపు కలెక్టర్​ చంద్రశేఖర్​ తనిఖీలు చేశారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు, కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి రోగులు, వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

district additional collector
district additional collector
author img

By

Published : Apr 21, 2021, 3:48 PM IST

కొవిడ్​ రోగులకు వైద్యం అందిస్తున్న పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో అడిషనల్​ కలెక్టర్​ చంద్రశేఖర్​ తనిఖీలు చేశారు. వైద్య సౌకర్యాలు, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత ఉందని వైద్యులు అదనపు కలెక్టర్​ దృష్టికి తీసుకొచ్చారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున ఆక్సిజన్​ కొరత ఏర్పడిందని... ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలో రోజురోజుకూ కొవిడ్​ పాజిటివ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయని అడిషనల్​ కలెక్టర్​ పేర్కొన్నారు. ప్రజలందరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని... అత్యవసరం అయితే తప్ప బయటకురావొద్దని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కొవిడ్​ రోగులకు వైద్యం అందిస్తున్న పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో అడిషనల్​ కలెక్టర్​ చంద్రశేఖర్​ తనిఖీలు చేశారు. వైద్య సౌకర్యాలు, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్​ కొరత ఉందని వైద్యులు అదనపు కలెక్టర్​ దృష్టికి తీసుకొచ్చారు. కొవిడ్​ కేసులు పెరుగుతున్నందున ఆక్సిజన్​ కొరత ఏర్పడిందని... ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

జిల్లాలో రోజురోజుకూ కొవిడ్​ పాజిటివ్​ కేసులు భారీగా పెరుగుతున్నాయని అడిషనల్​ కలెక్టర్​ పేర్కొన్నారు. ప్రజలందరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని... అత్యవసరం అయితే తప్ప బయటకురావొద్దని.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి: 'ఫోన్​ ద్వారా సమాచారమిస్తే.. ఇంటికే వచ్చి కరోనా పరీక్షలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.