ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నోఏళ్ల నుంచి విద్యా వాలంటీర్లుగా పని చేస్తున్న వారిని ఈ సంవత్సరం కూడా విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర విద్యావాలంటీర్లు సంఘం నిర్మల్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
తమకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు బోధించేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. కరోనా నేపథ్యంలో తాము ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని.. ప్రభుత్యమే ఆదుకోవాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు.
ఇవీచూడండి: వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డుల స్వాధీనానికి ప్రభుత్వం ఆదేశం