నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. ఉదయం పూట ఇస్తున్నసడలింపు వల్ల వాహనాలపై జనం విచ్చలవిడిగా రోడ్డెక్కుతున్న నేపథ్యంలో పట్టణంలోని శివాజీచౌక్లో కళాజాత బృందంతో ప్రదర్శన నిర్వహించారు.
ప్రజలు రహదారిపైకి వస్తే కరోనా వైరస్ సోకుతుందని... అలా జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు. అత్యవసర సమయంలోనే ప్రజలు బయటకు వెళ్లాలని, భౌతికదూరం పాటించాలని తెలిపారు. కరోనా వైరస్పై పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలను ప్రదర్శించారు. ప్రజలంతా ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.