నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. నేడు ఐదో రోజు పంచమి మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారు 'స్కంద మాతా' అవతారంలో భక్తులకు దర్శమిస్తున్నారు. అమ్మవారికి మూల నక్షత్ర సరస్వతి పూజలు జరిపారు.
అమ్మవారి సన్నిధిలో వేకువ జామున నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని నేరుగా వచ్చి టికెట్టు తీసుకొని అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. కొవిడ్, భారీ వర్షాల కారణంగా అమ్మవారి దర్శనానికి భక్తుల రాక తగ్గిందని అర్చకులు తెలిపారు.
ఇదీ చదవండి: వేయిస్తంభాల ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు