ETV Bharat / state

స్కందమాతాగా బాసర సరస్వతి దేవీ

author img

By

Published : Oct 21, 2020, 1:48 PM IST

శరన్నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు బాసరలోని సరస్వతి అమ్మవారు స్కంద మాతాగా దర్శనమిస్తున్నారు. మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది భక్తుల రాక తక్కువగా ఉన్నట్లు అర్చకులు తెలిపారు.

Navaratri celebrations at basara saraswathi temple in nirmal
స్కందమాతగా బాసర సరస్వతి దేవీ

నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. నేడు ఐదో రోజు పంచమి మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారు 'స్కంద మాతా' అవతారంలో భక్తులకు దర్శమిస్తున్నారు. అమ్మవారికి మూల నక్షత్ర సరస్వతి పూజలు జరిపారు.

అమ్మవారి సన్నిధిలో వేకువ జామున నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ఆన్​లైన్​లో బుకింగ్ చేసుకొని నేరుగా వచ్చి టికెట్టు తీసుకొని అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. కొవిడ్, భారీ వర్షాల కారణంగా అమ్మవారి దర్శనానికి భక్తుల రాక తగ్గిందని అర్చకులు తెలిపారు.

నిర్మల్ జిల్లా బాసరలో శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగవైభవంగా కొనసాగుతున్నాయి. నేడు ఐదో రోజు పంచమి మూల నక్షత్రాన్ని పురస్కరించుకొని అమ్మవారు 'స్కంద మాతా' అవతారంలో భక్తులకు దర్శమిస్తున్నారు. అమ్మవారికి మూల నక్షత్ర సరస్వతి పూజలు జరిపారు.

అమ్మవారి సన్నిధిలో వేకువ జామున నుంచే అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ఆన్​లైన్​లో బుకింగ్ చేసుకొని నేరుగా వచ్చి టికెట్టు తీసుకొని అక్షరాభ్యాసాలు చేస్తున్నారు. కొవిడ్, భారీ వర్షాల కారణంగా అమ్మవారి దర్శనానికి భక్తుల రాక తగ్గిందని అర్చకులు తెలిపారు.

ఇదీ చదవండి: వేయిస్తంభాల ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.