నిర్మల్ జిల్లా కేంద్రంలో సోఫి నగర్ కాలనీలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ అహ్మద్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 14 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఈ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు.
ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినా.. వేరే రాష్ట్రాలకు తరలించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని డీటీ ఎన్ఫోర్స్మెంట అధికారి ప్రకాశ్ రాఠోడ్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్