ETV Bharat / state

‘కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలి’

author img

By

Published : Apr 25, 2021, 4:08 PM IST

కొవిడ్ వ్యాక్సిన్​పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని నిర్మల్​ మున్సిపల్ ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని వివరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

covid cases in nirmal
covid cases in nirmal

కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్​ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రం 38వ వార్డు​లోని లయన్స్ క్లబ్​లో కౌన్సిలర్ నవనీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

వ్యాక్సిన్​పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఈశ్వర్ సూచించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

కరోనా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిర్మల్​ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రం 38వ వార్డు​లోని లయన్స్ క్లబ్​లో కౌన్సిలర్ నవనీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రత్యేక శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

వ్యాక్సిన్​పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఈశ్వర్ సూచించారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ నిర్భయంగా వ్యాక్సిన్ తీసుకోవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కరోనా టెస్ట్​లో నెగిటివ్ వచ్చింది.. కానీ ప్రాణం పోయింది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.