ETV Bharat / state

'ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి' - ​నిర్మల్​ జిల్లా తాజా వార్తలు

రోజురోజుకు కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో వైరస్​ పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని... నిర్మల్​ మున్సిపల్​ ఛైర్మన్​ గండ్రత్​ ఈశ్వర్​ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో క్లోరోఫిల్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

spraying chlorophyll in Nirmal district
నిర్మల్​ జిల్లా కేంద్రంలో క్లోరోఫిల్​ ద్రావణాన్ని పిచికారి చేయిస్తున్న ఛైర్మన్​, నిర్మల్​ జిల్లా తాజా వార్తలు
author img

By

Published : Apr 20, 2021, 3:22 PM IST

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని... నిర్మల్​ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు క్లోరోఫిల్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ ద్రావణాన్ని పిచికారి చేయించినట్లు ఆయన తెలిపారు. రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తోందని... వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని... నిర్మల్​ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రయాణ ప్రాంగణం నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు క్లోరోఫిల్ ద్రావణాన్ని పిచికారి చేయించారు.

కరోనా బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ ద్రావణాన్ని పిచికారి చేయించినట్లు ఆయన తెలిపారు. రోజురోజుకు మహమ్మారి విజృంభిస్తోందని... వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: నిలకడగా ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరోగ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.