రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిరుద్యోగ భృతి కలిపించాలంటూ నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్లో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ప్రైవేట్ టీచర్లు 9నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతపన్నారు. ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలి. నిరుద్యోగులను ఆదుకోవాలి.
-ఒడిసెల అర్జున్, బీజేవైఎం నేత
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాస్తారోకో చేపట్టిన ఆందోళన కారులను పోలీసులు అరెస్ట్ చేసి సోన్ స్టేషన్ తరలించారు.
ఇదీ చూడండి: పోస్టుల భర్తీకి జాబ్ బరో... లేకుంటే జైలు బరో