తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం ఉన్నప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. నేరానికి శిక్ష పడినప్పుడే వాటిని నివారించగలమని పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో జనవరి నెలలో మూడు నేరాల్లో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడటం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేరాలను మరింత త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.