ETV Bharat / state

ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్ - ప్రకృతి వనాలను పరిశీలించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

నల్గొండ జిల్లా నిడమనూరు, త్రిపురారం మండలాల్లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్​ పాటిల్​ పర్యటించారు. ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు పరిశీలించి... త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్
ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్
author img

By

Published : Aug 17, 2020, 6:34 PM IST


నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలను కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని గుంటిపల్లి, వేంపాడులో ప్రకృతి వనాలు ఏర్పాటు విధివిధానాలపై అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం త్రిపురారం మండలం కంపాసాగర్​లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, మొక్క నాటారు. కృషి విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలు... రైతులకు అందించే విత్తనాలు, సలహాలు, సూచనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలను కలెక్టర్​ ప్రశాంత్​ జీవన్​ పాటిల్​ పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని గుంటిపల్లి, వేంపాడులో ప్రకృతి వనాలు ఏర్పాటు విధివిధానాలపై అధికారులకు సూచనలు చేశారు.

అనంతరం త్రిపురారం మండలం కంపాసాగర్​లోని కృషి విజ్ఞాన కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, మొక్క నాటారు. కృషి విజ్ఞాన కేంద్రంలోని శాస్త్రవేత్తలు... రైతులకు అందించే విత్తనాలు, సలహాలు, సూచనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంలో భాగంగా ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.