ETV Bharat / state

సర్పంచ్‌ కుటుంబానికి ప్రముఖుల నివాళి

నల్గొండ జిల్లా నిడమనూరులో జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందిన... పెద్దవూర మండలం తెప్పలమడుగు సర్పంచ్‌ శ్రీను, అతడి భార్య, పిల్లల పార్థీవ దేహాలకు పలువురు నేతలు నివాళులర్పించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

author img

By

Published : Apr 3, 2021, 3:40 PM IST

Leaders pay tribute to Sarpanch family who died in Lorry accident in nalgonda district, nalgonda district latest news
లారీ ప్రమాదంలో మృతిచెందిన సర్పంచ్‌ కుటుంబానికి నివాళులర్పించిన నేతలు, మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించిన జానారెడ్డి

నల్గొండ జిల్లా నిడమనూరులో జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందిన... పెద్దవూర మండలం తెప్పలమడుగు సర్పంచ్‌ శ్రీను, అతడి భార్య, పిల్లల పార్థీవదేహాలకు పలువురు నేతలు నివాళులర్పించారు. సాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి, ఆయన సతీమణి నివేదితతో పాటు... తెదేపా నేత మువ్వ అరుణ్‌ కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంతాపం తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందటంతో తెప్పలమడుగు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

నల్గొండ జిల్లా నిడమనూరులో జరిగిన లారీ ప్రమాదంలో మృతి చెందిన... పెద్దవూర మండలం తెప్పలమడుగు సర్పంచ్‌ శ్రీను, అతడి భార్య, పిల్లల పార్థీవదేహాలకు పలువురు నేతలు నివాళులర్పించారు. సాగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జానారెడ్డి మృతదేహాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

భాజపా జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌ రెడ్డి, ఆయన సతీమణి నివేదితతో పాటు... తెదేపా నేత మువ్వ అరుణ్‌ కుమార్‌, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంతాపం తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందటంతో తెప్పలమడుగు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి: నర్సు నిర్వాకం- ఫోన్​ మాట్లాడుతూ రెండు సార్లు టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.