ETV Bharat / state

హుజూర్​నగర్ తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి

హుజూర్​నగర్ అసెంబ్లీకి తెరాస అభ్యర్థిని ప్రకటించింది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సైదిరెడ్డికే మరోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.

author img

By

Published : Sep 21, 2019, 2:29 PM IST

shanampudi saidireddy

హుజూర్​నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని సీఎం నిర్ణయించారు.

హుజూర్​నగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సైదిరెడ్డి గులాబీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రి, ఇతర ముఖ్య నాయకులతో కేసీఆర్ మాట్లాడారు. తిరిగి సైదిరెడ్డినే అభ్యర్థిగా నిలబెట్టాలని సీఎం నిర్ణయించారు.

ఇదీ చూడండి: మోగిన నగారా... అక్టోబర్ 21న హుజూర్​నగర్ ఉపఎన్నిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.