భారత్- చైనా సరిహద్దులో జరిగిన దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి నివాళులర్పించారు. "కాంగ్రెస్ సలాం" పేరిట నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా హాలియాలోని తన నివాసంలో సైనికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి... మౌనం పాటించి నివాళులర్పించారు.
భారత సరిహద్దుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న వీర జవాన్లకు శిరసు వంచి నమస్కరిస్తున్నామని జానారెడ్డి తెలిపారు. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన ప్రాణ త్యాగాలు వృథా కాకుండా కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని జానారెడ్డి పేర్కొన్నారు.