ETV Bharat / state

మామిడి మొక్కలు ధ్వంసం... గిరిజన రైతుల ధర్నా - కొల్లాపూర్​ అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా వార్తలు

నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ అటవీ శాఖ కార్యాలయం ఎదుట మారేడుమాన్​దిన్నే గ్రామ గిరిజన రైతులు ఆందోళనకు దిగారు. అటవీ భూముల్లో తాము సాగు చేసుకుంటున్న మామిడి మొక్కలను అధికారులు ధ్వంసం చేశారని ఆరోపించారు. సంబంధిత అధికారులపై తగు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్​ చేశారు.

Tribal farmers' dharna at kollapur forest office
మామిడి మొక్కలు ధ్వంసం చేశారంటూ గిరిజన రైతుల ధర్నా
author img

By

Published : Oct 22, 2020, 4:47 PM IST

నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ అటవీ శాఖ కార్యాలయం ఎదుట గిరిజన రైతులు ధర్నా చేపట్టారు. పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్​దిన్నె గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో నాటిన 1200 మామిడి మొక్కలను అటవీ శాఖ అధికారులు నరికేశారని ఆరోపించారు. గత 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని చెప్పినా.. వినకుండా మొక్కలను ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మామిడి మొక్కలను నరికివేయడం వల్ల తమకు దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపించారు. మొక్కలను ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే మామిడి మొక్కలను నాటించాలని.. తమను ఆదుకోవాలని కోరారు. గిరిజన రైతులపై అధికారులు దౌర్జన్యం చేస్తే ప్రతి దాడులు తప్పవని వారు హెచ్చరించారు.

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

నాగర్ కర్నూల్​ జిల్లా కొల్లాపూర్​ అటవీ శాఖ కార్యాలయం ఎదుట గిరిజన రైతులు ధర్నా చేపట్టారు. పెద్దకొత్తపల్లి మండలం మారేడుమాన్​దిన్నె గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో నాటిన 1200 మామిడి మొక్కలను అటవీ శాఖ అధికారులు నరికేశారని ఆరోపించారు. గత 25 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నామని చెప్పినా.. వినకుండా మొక్కలను ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మామిడి మొక్కలను నరికివేయడం వల్ల తమకు దాదాపు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆరోపించారు. మొక్కలను ధ్వంసం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే మామిడి మొక్కలను నాటించాలని.. తమను ఆదుకోవాలని కోరారు. గిరిజన రైతులపై అధికారులు దౌర్జన్యం చేస్తే ప్రతి దాడులు తప్పవని వారు హెచ్చరించారు.

ఇదీ చూడండి: బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.