కార్మిక సమస్యలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపం చెంది నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో ఆర్టీసీ డ్రైవర్ సత్తిరెడ్డి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కొల్లాపూర్లో డ్రైవరుగా పనిచేస్తున్న సత్తిరెడ్డి.. సమ్మెపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు.
సమాచారం తెలిసిన పోలీసులు టవర్ దగ్గరకు వెళ్లి డ్రైవర్ను సముదాయించినా.. వినలేదు. మెడకు వైర్ చుట్టుకొని వేలాడుతున్న సత్తిరెడ్డిని వెంటనే ఎస్ఐ మురళి గౌడ్ టవర్ పైకి ఎక్కి డ్రైవర్ మెడకు ఉన్న వైర్ను తొలగించారు. డ్రైవర్ సత్తిరెడ్డిని కిందకు దించే ప్రయత్నం చేశారు. శ్వాస సరిగ్గా తీసుకోకపోవడం వల్ల పోలీసులు కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నాగర్కర్నూల్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి : 'కాంగ్రెస్ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు'