ETV Bharat / state

భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. ఆందోళనలో రైతులు..

author img

By

Published : Sep 21, 2020, 11:53 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావటంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే మునిగిపోతుంటే చూడలేకపోయామని రైతులు వాపోయారు. పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

Damaged crops in  Combined mahabubnagar district
భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. ఆందోళనలో రైతులు..

భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి, కేటీదొడ్డి మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. ఉండవల్లి మండలం బొంకూరు పెద్ద వాగు ఇప్పటి 3,4 సార్లు పొంగింది. దీంతో ఈ వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలు మునిగిపోయాయి. 150 ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. కలుగోట్ల, శాలిపూర్, తక్కాశీల, కంచుపాడులో దాదాపు 502 ఎకరాల్లో పంట నష్ట వాటిల్లింది. మానవపాడు మండలంలో 1,171 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎక్కువగా పత్తి, ఉల్లి, మిర్చి పంట దెబ్బతింది. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. కేటిదొడ్డి, దరూర్, వడ్డేపల్లి, ఉండవల్లి, ఇటిక్యాల మనవపాడు మండలాల్లో సుమారు 3000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు గుర్తించారు.

కొట్టుకుపోయిన పంటలు

నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. చెరువులు, కాలువలు, కుంటల పక్కన ఉండే పొలాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పంటలు కొట్టుకుపోయాయి. వరి, పత్తి, కందులు, జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 600482 ఎకరాల్లో పంట సాగు చేస్తుండగా.. ఇందులో వరి 96 వేల ఎకరాలు, పత్తి నాలుగున్నర లక్షలు, మొక్కజొన్న 12 వేలు, కంది 25 వేలు, వేరు శనగ 20 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇందులో పత్తి, వరి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, తెల్కపల్లి, తిమ్మాజీపేట, ఉప్పునుంతల మండలాల్లో 7331 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.

పొలాల్లో ఇసుక మేటలు

ఈ ఏడాది నియంత్రిత వ్యవసాయ పద్ధతి ఆధారంగా అధికారులు సూచించినట్లుగా జొన్నలను వేశామని రైతులు అన్నారు. వర్షంతో జొన్న పంట మొత్తం పడిపోయిందని, కంకులు నల్లగా మారాయని వాపోయారు. ఎకరానికి 20 నుంచి 30 వేల రూపాయల పెట్టుబడి పెట్టామన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వనపర్తి జిల్లాలో వేల ఎకరాల్లో నీటమునిగింది. పలుచోట్ల కాలువలు తెగిపోవడం వల్ల భూమి కోతకు గురై పొలాల్లో ఇసుక మేటలు వేసింది. కల్వకుర్తి ఎత్తిపోతల కాలువలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడా తెగిపోవడం వల్ల రేవల్లి మండలంలో 456 మంది రైతులకు సంబంధించిన 1019 ఎకరాలు, గోపాల్​పేట మండలంలో 232 మంది రైతులకు సంబంధించి 738 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. పానగల్ మండలంలో 1381 ఎకరాలు, వీపనగండ్ల 883, కొత్తకోట 738, చిన్నంబావి 616, శ్రీరంగాపురం మండలంలో 646 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 3039 మంది రైతులకు సంబంధించి 5721 ఎకరాల్లో పంటకు నష్టవాటినట్లు అధికారులు గుర్తించారు.

అధికారులు వీలైనంత త్వరగా నష్టాన్ని అంచనా వేసి.. పరిహారం అందజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి: శ్రీశైలానికి భారీ వరద.. అప్రమత్తమైన అధికారులు

భారీ వర్షాలతో ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి, కేటీదొడ్డి మండలాల్లో ఎక్కువగా పంటలు దెబ్బతిన్నాయి. ఉండవల్లి మండలం బొంకూరు పెద్ద వాగు ఇప్పటి 3,4 సార్లు పొంగింది. దీంతో ఈ వాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాలు మునిగిపోయాయి. 150 ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. కలుగోట్ల, శాలిపూర్, తక్కాశీల, కంచుపాడులో దాదాపు 502 ఎకరాల్లో పంట నష్ట వాటిల్లింది. మానవపాడు మండలంలో 1,171 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఎక్కువగా పత్తి, ఉల్లి, మిర్చి పంట దెబ్బతింది. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. కేటిదొడ్డి, దరూర్, వడ్డేపల్లి, ఉండవల్లి, ఇటిక్యాల మనవపాడు మండలాల్లో సుమారు 3000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు గుర్తించారు.

కొట్టుకుపోయిన పంటలు

నాగర్ కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున పంటలకు నష్టం వాటిల్లింది. చెరువులు, కాలువలు, కుంటల పక్కన ఉండే పొలాలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పంటలు కొట్టుకుపోయాయి. వరి, పత్తి, కందులు, జొన్న, వేరుశనగ, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలో 600482 ఎకరాల్లో పంట సాగు చేస్తుండగా.. ఇందులో వరి 96 వేల ఎకరాలు, పత్తి నాలుగున్నర లక్షలు, మొక్కజొన్న 12 వేలు, కంది 25 వేలు, వేరు శనగ 20 వేల ఎకరాల్లో పండిస్తున్నారు. ఇందులో పత్తి, వరి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లి, తెల్కపల్లి, తిమ్మాజీపేట, ఉప్పునుంతల మండలాల్లో 7331 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు.

పొలాల్లో ఇసుక మేటలు

ఈ ఏడాది నియంత్రిత వ్యవసాయ పద్ధతి ఆధారంగా అధికారులు సూచించినట్లుగా జొన్నలను వేశామని రైతులు అన్నారు. వర్షంతో జొన్న పంట మొత్తం పడిపోయిందని, కంకులు నల్లగా మారాయని వాపోయారు. ఎకరానికి 20 నుంచి 30 వేల రూపాయల పెట్టుబడి పెట్టామన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వనపర్తి జిల్లాలో వేల ఎకరాల్లో నీటమునిగింది. పలుచోట్ల కాలువలు తెగిపోవడం వల్ల భూమి కోతకు గురై పొలాల్లో ఇసుక మేటలు వేసింది. కల్వకుర్తి ఎత్తిపోతల కాలువలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడక్కడా తెగిపోవడం వల్ల రేవల్లి మండలంలో 456 మంది రైతులకు సంబంధించిన 1019 ఎకరాలు, గోపాల్​పేట మండలంలో 232 మంది రైతులకు సంబంధించి 738 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. పానగల్ మండలంలో 1381 ఎకరాలు, వీపనగండ్ల 883, కొత్తకోట 738, చిన్నంబావి 616, శ్రీరంగాపురం మండలంలో 646 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 3039 మంది రైతులకు సంబంధించి 5721 ఎకరాల్లో పంటకు నష్టవాటినట్లు అధికారులు గుర్తించారు.

అధికారులు వీలైనంత త్వరగా నష్టాన్ని అంచనా వేసి.. పరిహారం అందజేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదీ చదవండి: శ్రీశైలానికి భారీ వరద.. అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.