ETV Bharat / state

వర్షాలకు కూలిన కల్వర్టు... స్తంభించిన రాకపోకలు - నాగర్​కర్నూల్​ తాజా వార్తలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేట మండలంలో ఆంజనేయ తండా వద్ద కల్వర్టు కూలింది. మరోవైపు పక్కనే ఉన్న దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Culvert collapsed at achampet Mandal in nagarkurnool district
ఓవైపు కూలిన కల్వర్టు... మరోవైపు ఉగ్రరూపం దాల్చిన దుందుభి వాగు
author img

By

Published : Oct 18, 2020, 2:46 PM IST

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఘనపురం సమీపంలో ఆంజనేయ తండా వద్ద కల్వర్టు కూలింది. పరిసర గ్రామాలైన దండల్యం తండా, ఆంజనేయ తండా, అక్కారం, బక్కలింగయ్య పల్లిలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పక్కనే దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక గ్రామాల్లో రవాణా పూర్తిగా స్తంభించింది.

ఓ వైపు కూలిన కల్వర్టు... మరోవైపు ఉగ్రరూపం దాల్చిన దుందుభి వాగు వరదలతో స్థానిక ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం ఘనపురం సమీపంలో ఆంజనేయ తండా వద్ద కల్వర్టు కూలింది. పరిసర గ్రామాలైన దండల్యం తండా, ఆంజనేయ తండా, అక్కారం, బక్కలింగయ్య పల్లిలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పక్కనే దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. స్థానిక గ్రామాల్లో రవాణా పూర్తిగా స్తంభించింది.

ఓ వైపు కూలిన కల్వర్టు... మరోవైపు ఉగ్రరూపం దాల్చిన దుందుభి వాగు వరదలతో స్థానిక ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: భాగ్యనగరంలో కాలనీలు జలమయం... అవస్థల్లో జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.