ETV Bharat / state

దాతల విరాళాలు దుర్వినియోగం : తల్లోజు ఆచారి

author img

By

Published : Apr 26, 2020, 9:13 PM IST

కరోనా నివారణ కోసం పీఎం, సీఎం సహాయనిధికి దాతలు అందించిన విరాళాలు దుర్వినియోగమయ్యాయని... జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. ఆర్​బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిధుల సేకరణ జరిగిందన్నారు.

తల్లోజు ఆచారి
తల్లోజు ఆచారి

కరోనా నియంత్రణ కోసం పీఎం, సీఎం సహాయనిధికి దాతలు అందించిన నిధులు, చెక్కుల్లో భారీగా అవినీతి జరిగిందని జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. నాగర్​కర్నూలు​ జిల్లా కల్వకుర్తిలోని భాజపా కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తిలో కొందరు దాతలు ఇచ్చిన విరాళాలను... ఓ ఎమ్మెల్యే తన బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఎంత వరకు సమంజసమని ఆచారి ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన వ్యక్తిగత ఖాతాలో 7 లక్షల71 వేల రూపాయలు జమ చేసుకున్నారని... అందుకు సంబంధించిన పత్రాలను ఆయన ప్రవేశపెట్టారు. రూ. 25 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఇవ్వాలన్న ఆర్​బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిధుల సేకరణ జరిగిందన్నారు.

కరోనా నియంత్రణ కోసం పీఎం, సీఎం సహాయనిధికి దాతలు అందించిన నిధులు, చెక్కుల్లో భారీగా అవినీతి జరిగిందని జాతీయ బీసీ కమిషన్​ సభ్యుడు తల్లోజు ఆచారి ఆరోపించారు. నాగర్​కర్నూలు​ జిల్లా కల్వకుర్తిలోని భాజపా కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తిలో కొందరు దాతలు ఇచ్చిన విరాళాలను... ఓ ఎమ్మెల్యే తన బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఎంత వరకు సమంజసమని ఆచారి ప్రశ్నించారు. ఎమ్మెల్యే తన వ్యక్తిగత ఖాతాలో 7 లక్షల71 వేల రూపాయలు జమ చేసుకున్నారని... అందుకు సంబంధించిన పత్రాలను ఆయన ప్రవేశపెట్టారు. రూ. 25 వేల కంటే ఎక్కువ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఇవ్వాలన్న ఆర్​బీఐ నిబంధనలకు విరుద్ధంగా నిధుల సేకరణ జరిగిందన్నారు.

ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.