ETV Bharat / state

మేడారం మినీ జాతర హుండీ లెక్కింపు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో గత నెలలో జరిగిన మినీ మేడారం జాతరకు సంబంధించి.. హుండీ లెక్కింపు చేపట్టారు. భారీ నగదుతో పాటు.. పలు బంగారు, వెండి కానుకలు వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

author img

By

Published : Mar 25, 2021, 7:02 AM IST

medaram chinna jathara hundi lekkimpu
మినీ మేడారం జాతర హుండీ లెక్కింపు

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. మేడారంలో హుండీ లెక్కింపు చేశారు. గత నెలలో జరిగిన మినీ మేడారం జాతర నుంచి.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద, గోవిందరాజులకు.. ఇప్పటివరకు భక్తుల నుంచి అందిన కానుకలను విడివిడిగా లెక్కించారు.

సమ్మక్క హుండీకి.. రూ. 43 లక్షల 95 వేలు, సారలమ్మకు రూ. 35 లక్షల 49 వేలు, గోవిందరాజుకు రూ. 2 లక్షలు, పగిడిద్దరాజుకు రూ. 96 వేల ఆదాయంతో పాటు పలు బంగారు, వెండి కానుకలు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

గత నెలలో.. 24 నుంచి 28వ తేదీ వరకు జరిగిన చిన్న జాతర ముగిసినా.. భక్తులు దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. ముగ్గురు ఎండోమెంట్ అధికారులకు కరోనా సోకడంతో.. ఈ నెల 1 నుంచి 20 వ తేదీ వరకు వనదేవతల దర్శనాన్ని నిలిపివేశారు. మళ్లీ 21 తేదీ నుంచి గుడి తలుపులు తెరవడంతో భక్తులకు దర్శన భాగ్యం కలుగుతోంది.

ఇదీ చదవండి: కళారూపానికి కాదేదీ అనర్హం!

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. మేడారంలో హుండీ లెక్కింపు చేశారు. గత నెలలో జరిగిన మినీ మేడారం జాతర నుంచి.. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద, గోవిందరాజులకు.. ఇప్పటివరకు భక్తుల నుంచి అందిన కానుకలను విడివిడిగా లెక్కించారు.

సమ్మక్క హుండీకి.. రూ. 43 లక్షల 95 వేలు, సారలమ్మకు రూ. 35 లక్షల 49 వేలు, గోవిందరాజుకు రూ. 2 లక్షలు, పగిడిద్దరాజుకు రూ. 96 వేల ఆదాయంతో పాటు పలు బంగారు, వెండి కానుకలు సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

గత నెలలో.. 24 నుంచి 28వ తేదీ వరకు జరిగిన చిన్న జాతర ముగిసినా.. భక్తులు దర్శనం కోసం భారీగా తరలి వచ్చారు. ముగ్గురు ఎండోమెంట్ అధికారులకు కరోనా సోకడంతో.. ఈ నెల 1 నుంచి 20 వ తేదీ వరకు వనదేవతల దర్శనాన్ని నిలిపివేశారు. మళ్లీ 21 తేదీ నుంచి గుడి తలుపులు తెరవడంతో భక్తులకు దర్శన భాగ్యం కలుగుతోంది.

ఇదీ చదవండి: కళారూపానికి కాదేదీ అనర్హం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.