ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పద్మావతి, ఆలివేలు మంగ- వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, బాజాభజంత్రీలు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో స్వామివారి కల్యాణం కనులవిందుగా సాగింది.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు చలువ పందిళ్లు వేశారు. మహోత్సవ వేడుకలు ఏప్రిల్ 2న వసంతోత్సవంతో ముగియనున్నాయి.
ఇదీ చూడండి: భక్తుల కొంగుబంగారం... వెంకటాపురం లక్ష్మీనరసింహుడు..