ETV Bharat / state

వైభవంగా తిరుకల్యాణ మహోత్సవం

మేళ తాళాలు, బాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ములుగు జిల్లా వెంకటాపురంలో పద్మావతి, ఆలివేలు మంగ- వెంకటేశ్వర స్వామి వారి తిరు కల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై వేడుకను తిలకించారు.

author img

By

Published : Mar 28, 2021, 5:36 PM IST

Tirukalyan Mahotsavam
తిరుకల్యాణ మహోత్సవం

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పద్మావతి, ఆలివేలు మంగ- వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, బాజాభజంత్రీలు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో స్వామివారి కల్యాణం కనులవిందుగా సాగింది.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు చలువ పందిళ్లు వేశారు. మహోత్సవ వేడుకలు ఏప్రిల్ 2న వసంతోత్సవంతో ముగియనున్నాయి.

ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో పద్మావతి, ఆలివేలు మంగ- వెంకటేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, బాజాభజంత్రీలు వేద పండితుల మంత్రోచ్ఛారణలతో స్వామివారి కల్యాణం కనులవిందుగా సాగింది.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కొవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో స్వామి వారి కల్యాణం తిలకించేందుకు చలువ పందిళ్లు వేశారు. మహోత్సవ వేడుకలు ఏప్రిల్ 2న వసంతోత్సవంతో ముగియనున్నాయి.

ఇదీ చూడండి: భక్తుల కొంగుబంగారం... వెంకటాపురం లక్ష్మీనరసింహుడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.