ETV Bharat / state

ఒడ్డున ఉన్న మా ఇబ్బందులు చూడండయ్యా..

ఏటా వర్షాలు ఎప్పడు కురుస్తాయా... నదుల్లోకి నీరొచ్చి పంటలకు నీళ్లు ఎప్పుడు అందుతాయా అని అందరూ ఎదురు చూస్తుంటారు. కానీ ఈ ఊరివాళ్లు మాత్రం వరదలొస్తున్నాయంటే కంటిమీద కునుకుండదు. సాయంత్రం చూసిన భూమి తెల్లారేసరికి గోదావరిలో కలిసిపోతుందేమోనని..దిగులుతో కాలం గడుపుతారు. వారే ములుగు జిల్లా మంగపేట మండల పొద్మూరు గ్రామస్థులు.

author img

By

Published : Sep 7, 2019, 9:05 PM IST

ఒడ్డున ఉన్న మా ఇబ్బందులు చూడండయ్యా..

ఏటి ఒడ్డున ఊరు.. పుష్కలంగా నీరు... వాళ్లకేమి ఇబ్బంది అనుకుంటారు చాలామంది. మునిగిన వాడికే తెలుస్తుంది లోతెంతో.. అన్న చందంగా వరదలొచ్చినప్పుడు ఆ బాధలు పడిన వారికే తెలుస్తుంది ఆ ఇబ్బందులేంటో.. గంట గంటకూ పెరిగిపోయే వరద ఉద్ధృతికి ఏ సమయాన ఊరిని ముంచెత్తుతుందో... నీటి ప్రవాహా వేగంతో ఏటి ఒడ్డున ఎవరి భూమిని తనలో కలిపేసుకుంటుందోనన్న భయం.. వారికి కంటిమీద కునకుండడంలేదు. ములుగు జిల్లా మంగపేట మండలం పొద్మూరులో ఏటా వరద ఉద్ధృతిలో పదుల ఎకరాల్లో భూమి నీటిలో కరిగిపోతుంది.

కళ్లముందే కొట్టుకుపోతోంది

ప్రధాన నది ఒడ్డు పక్కనే ఊళ్లో వరద వస్తుందంటే గ్రామస్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటికే ఏటి గట్టున ఉన్న వ్యవసాయ భూములు నాలుగు మీటర్ల మేర కోతకు గురయ్యాయి. పుష్కర ఘాట్​ వద్ద నిర్మించిన వాటర్​ ట్యాంక్​ కూడా నదిలో కొట్టుకుపోయింది. పుష్కరఘాట్​ వరకు భూమి కోతకు గురవుతోంది. పుష్కర ఘాట్​లో మెట్లు కూడా నామరూపాల్లేకుండా పోతున్నాయి.

నీటి మూటగా మారిన నేతల హామీలు

గతంలో వరదల సమయంలో ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రులు, అధికారులు తక్షణమే మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. రివిట్​మెంట్​ వేయిస్తామని ఒడ్డు కొట్టుకుపోకుండా గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చిన నేతల మాటలు నీటిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వరద ప్రవాహాం నుంచి తమ భూములకు, ఊరికి రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని మంగంపేట, పొద్మూరు, బోరునర్సాపురం గ్రామస్థులు కోరుతున్నారు.

ఒడ్డున ఉన్న మా ఇబ్బందులు చూడండయ్యా..

ఇదీ చూడండి: వంతెన లేక కి.మీ. పది కిలోమీటర్లైంది..

ఏటి ఒడ్డున ఊరు.. పుష్కలంగా నీరు... వాళ్లకేమి ఇబ్బంది అనుకుంటారు చాలామంది. మునిగిన వాడికే తెలుస్తుంది లోతెంతో.. అన్న చందంగా వరదలొచ్చినప్పుడు ఆ బాధలు పడిన వారికే తెలుస్తుంది ఆ ఇబ్బందులేంటో.. గంట గంటకూ పెరిగిపోయే వరద ఉద్ధృతికి ఏ సమయాన ఊరిని ముంచెత్తుతుందో... నీటి ప్రవాహా వేగంతో ఏటి ఒడ్డున ఎవరి భూమిని తనలో కలిపేసుకుంటుందోనన్న భయం.. వారికి కంటిమీద కునకుండడంలేదు. ములుగు జిల్లా మంగపేట మండలం పొద్మూరులో ఏటా వరద ఉద్ధృతిలో పదుల ఎకరాల్లో భూమి నీటిలో కరిగిపోతుంది.

కళ్లముందే కొట్టుకుపోతోంది

ప్రధాన నది ఒడ్డు పక్కనే ఊళ్లో వరద వస్తుందంటే గ్రామస్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఇప్పటికే ఏటి గట్టున ఉన్న వ్యవసాయ భూములు నాలుగు మీటర్ల మేర కోతకు గురయ్యాయి. పుష్కర ఘాట్​ వద్ద నిర్మించిన వాటర్​ ట్యాంక్​ కూడా నదిలో కొట్టుకుపోయింది. పుష్కరఘాట్​ వరకు భూమి కోతకు గురవుతోంది. పుష్కర ఘాట్​లో మెట్లు కూడా నామరూపాల్లేకుండా పోతున్నాయి.

నీటి మూటగా మారిన నేతల హామీలు

గతంలో వరదల సమయంలో ప్రాంతాన్ని సందర్శించిన మాజీ మంత్రులు, అధికారులు తక్షణమే మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చినా అవి కార్యరూపం దాల్చలేదు. రివిట్​మెంట్​ వేయిస్తామని ఒడ్డు కొట్టుకుపోకుండా గోడ నిర్మిస్తామని హామీ ఇచ్చిన నేతల మాటలు నీటిలో కలిసిపోయాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వరద ప్రవాహాం నుంచి తమ భూములకు, ఊరికి రక్షణ ఏర్పాట్లు చేపట్టాలని మంగంపేట, పొద్మూరు, బోరునర్సాపురం గ్రామస్థులు కోరుతున్నారు.

ఒడ్డున ఉన్న మా ఇబ్బందులు చూడండయ్యా..

ఇదీ చూడండి: వంతెన లేక కి.మీ. పది కిలోమీటర్లైంది..

Intro:tg_wgl_51_04_kooli_pothunna_godavari_oddu_pkg_ts10072_HD
G Raju mulugu contributar

యాంకర్ : వర్షాకాలం వచ్చిందంటే చాలు గోదావరి ఉధృతంగా ప్రవహించి వరద నీటికి గోదావరి ఒడ్డు అంచెలంచెలుగా కూలిపోతుంది. సాగు చేసుకునే భూములు ఎకరాల కొద్దీ గోదావరి లోనే ఉందని, ప్రభుత్వ అధికారులకు ఎన్ని మార్లు మొరపెట్టుకున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పంటలు పండించుకునే పొలాలు గోదావరి లో ఉంటే మా జీవనం ఎలా సాగదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Body:వాయిస్ ఓవర్ : ములుగు జిల్లా మంగపేట మండలంలోని పోద్మూ రూ సమీపంలో గోదావరి వరద పోటుతో వ్యవసాయ భూమి వారం రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీరు ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి పుష్కర ఘాట్ వద్ద వ్యవసాయ భూమి నాలుగు మీటర్ల మేర గోదావరి లో కలిసి పోయింది. గోదావరి పుష్కరాల సమయంలో భక్తుల తాగు నీటి కోసం 80 వేలుతో నిర్మించిన మినీ వాటర్ ట్యాంక్ సైతం కోతకు గురై వరద నీటిలో కొట్టుకుపోయింది. దొంగలోర్రె నుంచి పుష్కరఘాట్ వరకు భూమి రోజురోజుకు కోతకు గురవుతూనే ఉంది. గోదారి ఒడ్డు వెంబడి మంగపేట రైతులు మిర్చి, వరి పంటలు సాగు చేస్తుంటారు. గోదావరి వరద నీరు ఉదృతంగా ప్రవేశించి నప్పుడే ఒడ్డు కొట్టుకుపోతుంది. పుష్కరఘాట్ వరకు వెళ్లే తారు రోడ్డు కూడా గోదావరికి మూడు మీటర్ల వరకే ఉంది. పుష్కరఘాట్ వద్ద రెండు చోట్ల నిర్మించిన మెట్లు కూడా వరద పోటుకు గురయ్యాయి. పుష్కరఘాట్ పొడవునా ఒండ్రు మట్టి పేరుకుపోయింది. 2014 జులై నెలలో గోదావరి పుష్కరాల సమయంలో రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీటికి కూలుతున్న గోదారి ఒడ్డును చూసి తక్షణ మరమ్మతులు చేపడతామని భూమి కోల్పోతున్న మా రైతులకు హామీ ఇచ్చారని వారు అన్నారు. గోదావరి ఒడ్డు కూలిపోకుండా గోడ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రులు మై మర్చిపోయారని వారు అన్నారు. పుష్కర ఘాట్ కు పోయే తారు రోడ్డు కొట్టుకుపోతే పోద్మూరు వాడకు గోదావరి వరద నీటితో ఈ వాడ లో ఉన్న ఇల్లు కోల్పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే చొరవ తీసుకుని కోతకు గురికాకుండా సిమెంటు రివిట్ మెంట్ వాల్ నిర్మించాలని మంగపేట, పోద్మూరు, బోరునర్సాపురం రైతులు కోరుతున్నారు.


Conclusion:బైట్స్ : 1 షేద్వా షేక్ భూమి కోల్పోయిన రైతు
2 సమ్మయ్య భూమి కోల్పోయిన రైతు
3 నాగార్జున గ్రామస్తుడు
4 రామస్వామి గ్రామస్తుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.