ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పట్ల ములుగు జిల్లా ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వ్యాధి ప్రబలకుండా ముందస్తు చర్యలకు అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
దవాఖానలో ఇతర వార్డులో ఉన్న రోగులకు ఎలాంటి సంబంధం లేకుండా ఏడు పడకలతో దీనిని నెలకొల్పినట్లు వైద్యులు తెలిపారు. దీనికోసం ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఓపీకి కరోనా లక్షణాలతో వచ్చిన వారిని వెంటనే పరీక్షించి ప్రత్యేక వార్డులోకి తరలించాలని నిర్ణయించారు.
ఇవీచూడండి: దూలపల్లిలో కరోనా ఐసోలేషన్ సెంటర్..!