నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు భారత్ బంద్లో భాగంగా మేడ్చల్ బస్ డిపో ఎదురుగా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.
అనంతరం శ్రేణులతో కలిసి ఆందోళనలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేడ్చల్ క్యాంప్ కార్యాలయం నుంచి డిపో వరకు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: అన్నదాతలకు మద్దతుగా బంద్... రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు