మేడ్చల్ జిల్లాలో పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. కీసర తహసీల్దార్గా గౌరీ వత్సల, కాప్రా తహసీల్దార్గా గౌతమ్ కుమార్ను నియమించింది.
మేడ్చల్ తహసీల్దార్గా గీత, షామీర్పేట్ తహసీల్దార్గా సురేందర్, కుత్బుల్లాపూర్ తహసీల్దార్గా మహిపాల్ రెడ్డి, కూకట్పల్లి తహసీల్దార్గా గోవర్ధన్, బాచుపల్లి తహసీల్దార్గా భూపాల్లను నియమిస్తూ... కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు పట్టుబడిన అనంతరం.. బదిలీలు చేయడంపై ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి: నెమ్మదించిన కృష్ణమ్మ.. నాగార్జునసాగర్కు తగ్గిన వరద